విశాలాంధ్ర`కళ్యాణదుర్గం : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీలో కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన రా%శీ%భూపాల్ రెడ్డికి చోటు దక్కింది. శుక్రవారం ఆ పార్టీ ప్రకటించిన రాష్ట్ర కమిటీ లో కంబదూరు మండలం వెంకటం పల్లికి చెందిన సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త రాంభూపాల్ రెడ్డికి పిసిసి రాష్ట్ర కమిటీ లో సహాయ కార్యదర్శిగా నియమించారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రచార సమన్వయకర్తగా పనిచేసిన రా%శీ%భూపాల్ రెడ్డికి రాష్ట్ర కమిటీ లో చోటు దక్కడం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు . ప్రతిపక్షంలో అనేక పోరాటాలు చేసి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల మన్ననలు పొందారు. ఈ క్రమంలో రాష్ట్ర కమిటీలో చోటు దక్కడం పట్ల రాంభూపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మాజీ పీసీసీ అధ్యక్షులు రఘువీరారెడ్డి, సాకే శైలజనాథ్ లకు ఆయన తన ధన్యవాదాలు తెలిపారు. తన పట్ల పార్టీ ఉంచిన బాధ్యతను తూచా తప్పకుండా నిర్వహిస్తారని పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తారని చెప్పారు.