Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

క్రీడారంగములో మెరిసిన యశోద పాఠశాల విద్యార్థులు

విశాలాంధ్ర- ధర్మవరం: అనంతపురంలోని ఆర్ట్స్ కాలేజీలో, బుక్కరాయ సముద్రం లో ఈనెల 23 25 వ తేదీల్లో జరిగిన అతెట్లిక్ విభాగంలో అండర్- 17, అండర్- 14 విభాగంలో ఎస్ జి ఎఫ్- జిల్లా సాయి స్కూల్ గేమ్స్ సెలక్షన్లో యశోద పాఠశాల విద్యార్థులు ప్రతిభ ఘనపరిచి ,రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం జరిగిందని డైరెక్టర్ పృథ్విరాజ్ ప్రిన్సిపాల్ అనూప్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం వారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయికి ఎంపికైన వారిలో తొమ్మిదవ తరగతి చదువుతున్న గిరి వర్ధన్ జావలిన్ త్రోలో- రెండవ స్థానం, ఎనిమిదవ తరగతి చదువుతున్న తన్మయశ్రీ చరణ్ అండర్ -14 విభాగంలో 100 మీటర్ల రన్నింగ్ లో ఒకటవ స్థానం, 8వ తరగతి చదువుతున్న నిత్యశ్రీ బాస్కెట్బాల్ లో ఎంపిక కావడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఆ విద్యార్థులను డైరెక్టర్ ప్రిన్సిపాల్ తో పాటు వ్యాయామ ఉపాధ్యాయులు, బోధన, బోధనేతర ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img