ట్వీట్ చేసిన తేజశ్వి యాదవ్..
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజశ్వి యాదవ్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. రోహిణి కిడ్నీని.. వైద్యులు లాలూకు విజయవంతంగా అమర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం రోహిణి, లాలూ ఇద్దరూ ఐసీయూలో ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. లాలూ ఆరోగ్యం బాగుండాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు లాలూ ఆసుపత్రిలో ఉన్న వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశారు.