విశాలాంధ్ర-రాప్తాడు : మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న డి. శశాంక్, కె.సాయి కుమార్ అనే విద్యార్థులు అండర్-17 బేస్ బాల్ రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ పద్మజాదేవి గురువారం తెలిపారు. ఈ సందర్భంగా వారిని ఉపాధ్యాయులు, పీఈటీ అభినందించారు.