Friday, May 3, 2024
Friday, May 3, 2024

ధర్మవరం ఫ్ఏసి తహసిల్దారుగా యుగేశ్వరీ దేవి బాధ్యతల స్వీకరణ..

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న నీలకంఠారెడ్డి కొన్ని అనివార్య కారణాల వలన సెలవులోకి వెళ్లారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారము నుండి ఫుల్ అడిషనల్ ఇన్చార్జిగా (ఫ్ ఏ సీ) యుగేశ్వరి దేవి బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం వీరు బత్తలపల్లి తాసిల్దారుగా కూడా విధులు నిర్వర్తిస్తున్నారు. అనంతరం యుగేశ్వరి దేవి మాట్లాడుతూ మండల ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి, అవకాశం గల వాటి ఫిర్యాదులకు వెంటనే పరిష్కరించగలనని తెలిపారు. తోటి అధికారులు, సిబ్బందితో తాను తహసిల్దార్ కార్యాలయాన్ని మరింత అభివృద్ధి బాటలో నడుపుతానని తెలిపారు. తదుపరి కార్యాలయ అధికారులు, సిబ్బంది, వీఆర్వోలు, విఆర్ఏలు బొకేలు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img