Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

మహిళ అదృశ్యంపై పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు

విశాలాంధ్ర`ఉరవకొండ : ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన చేను కావలి వెంకటలక్ష్మి(50) అదృశ్యమైన సంఘటనపై ఆమె భర్త చేను కావలి గోపాల్‌ సోమవారం ఉరవకొండ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన భార్య గత నవంబర్‌ 26వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆచూకీ కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.తమకు ముగ్గురు కుమారులు ఉన్నారని ఒకరు కర్ణాటకలోని బళ్లారిలో నివాసం ఉంటుండగా మరో ఇద్దరు కుమారులు నా భార్య కలిసి ఉంటున్నామని అయితే అనుకోని విధంగా తమ భార్య కనిపించకుండా పోయిందన్నారు. తన భార్యకు మతి స్థిమితం కూడా సరిగ్గా ఉండడం లేదని ఆయన పేర్కొన్నారు తన భార్య ఆచూకీ కనుక్కొని తెలియజేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img