Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు

విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్‌ : ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరావు చౌదరి, నియోజకవర్గ ఇన్చార్జ్‌ ఉమామహేశ్వర్‌ నాయుడు పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎన్టీఆర్‌ భవన్లో అమరజీవి చిత్రపటానికి వేరువేరుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన మహనీయుడని అలాంటి మహనీయుని ఎంత స్మరించుకున్న తక్కువే నని వారు కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ఈనాటి యువకులు ఉద్యమ రూపంలో ముందుకు కదల్సిన అవసరం నేడు ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ దొరకట్ట నారాయణ ,పట్టణ కన్వీనర్‌ శర్మాస్‌ వలి, డిష్‌ రూరల్‌ మండలం అధ్యక్షులు గోళ్ల వెంకటేశులు,మురళి ,తలారి సత్తప్ప, బిక్కి గోవిందరాజులు, నాగరాజు, గంగన్న, రాయుడు, సురేష్‌ యాదవ్‌ ,నరేష్‌ ,వేణు ఎర్రి స్వామి, నరేష్‌, హనుమంతరాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img