Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రాహుల్‌ గాంధీ షూలేస్‌పై వివాదం.. ట్వీట్లతో విరుచుకుపడిన ఇరు పార్టీల నేతలు

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర హర్యానాలోకి ప్రవేశించింది. కాగా ఈ యాత్రలో రాహుల్‌ గాంధీకి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అయ్యింది. దీనిపై బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయా ట్వీట్‌ చేశారు. దీనిపై కాంగ్రెస్‌ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్‌ ను డిలీట్‌ చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీతో పాటు కేంద్ర మాజీ మంత్రి భన్వర్‌ జితేంద్ర సింగ్‌ అహిర్వార్‌ కూడా పాల్గొన్నారు. ఆయన వెంట కలిసి నడిచారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ ఒక్క సారిగా ఆగిపోయారు. తన షూ లో ఏదో సమస్య వచ్చిందని చెప్పారు. దీంతో జితేంద్ర సింగ్‌ మోకాళ్లపై కూర్చొని షూ లేస్‌ సరి చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. కొన్ని సెకన్ల తరువాత ఆ పాదయాత్ర మళ్లీ కొనసాగింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవీయ ట్వీట్‌ చేశారు. మాజీ కేంద్ర మంత్రి భన్వర్‌ జితేంద్ర సింగ్‌ రాహుల్‌ గాంధీ షూలేస్‌లను కట్టడానికి మోకరిల్లారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img