Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అభివృద్ధిని చూసి ఓర్వలేకే టిడిపి విమర్శలు


విశాలాంధ్ర, పెద్దకడబూరు :వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే టిడిపి నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి అన్నారు. శనివారం మండల పరిధిలోని గవిగట్టు గ్రామంలో గ్రామ సర్పంచ్‌ నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు అన్నారు. పేదలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి, విధ్యాదీవెన, విద్యావసతి తదితర పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. టీడీపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా వైసీపీ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర యువనాయకులు ప్రదీప్‌ రెడ్డి, వ్యవసాయ సలహా మండలి చ్కెర్మన్‌ పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్‌ రామ్మోహన్‌ రెడ్డి, రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ చంద్రశేఖర రెడ్డి, నాయకులు రవిచంద్రా రెడ్డి, విజయేంద్ర రెడ్డి, గాది రెడ్డి, మునిస్వామి, మహాదేవ, అయ్యప్ప, బంగారప్ప, నాగేష్‌, ఎంపిడిఓ రమణప్ప, తాసిల్దార్‌ వీరేంద్ర గౌడ్‌, ఆర్‌ ఐ మహేష్‌, ఏఈ లు వేణుగోపాల్‌, నాగవేంద్రం, సాయికుమార్‌, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img