Monday, May 6, 2024
Monday, May 6, 2024

హామీలను అమలు చేయడంలో వైసీపీ విఫలం

విశాలాంధ్ర`పెద్దకడబూరు : ఎన్నికలు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని టీడీపీ టౌన్‌ కార్యదర్శి ఆంజనేయ, నాయకులు అంజి విమర్శించారు. గురువారం పెద్దకడబూరు గ్రామంలోని చౌడేశ్వరిదేవి కాలనీలో మంత్రాలయం టిడిపి నియోజకవర్గ ఇంచార్జీ తిక్కారెడ్డి, ఆదేశాల మేరకు, క్లస్టర్‌ ఇంచార్జీ నరవ రమాకాంతరెడ్డి ఆధ్వర్యంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు కరపత్రాలను పంపిణీ ద్వారా తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వంతో ప్రజలు విసిగి పోయారన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపిని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద లక్ష్మన్న, నడిపి లక్ష్మన్న, చిన్న హనుమన్న, అంజినయ్య, మైనార్టీ నాయకులు బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img