Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

వేలమంది వచ్చే ప్రాంతంలో వంద మంది పోలీసులు కూడా లేరు : అచ్చెన్న

గుంటూరు ఘటనకు జగన్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన సోషల్‌ మీడియాలో స్పందించారు. ఉయ్యూరు ఫౌండేషన్‌ పోలీసుల అనుమతితోనే సభ ఏర్పాటు చేసిందని, కానీ వేలాది మంది జనం వచ్చే ప్రాంతంలో కనీసం వంద మంది పోలీసులు కూడా లేరని అచ్చెన్న విమర్శించారు. తోపులాట చోటుచేసుకున్న సమయంలో పోలీసులు కూడా సరిగా స్పందించలేదని ఆరోపించారు. పైగా, ఘటన జరిగిన వెంటనే మంత్రులు క్యూ కట్టడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు.టీడీపీ పార్టీ కూడా సోషల్‌ మీడియాలో సీఎం జగన్‌ పై ధ్వజమెత్తింది. తొక్కిసలాటలు జరిగేలా చేసి చంద్రబాబును కారకుడిగా చేస్తున్నారని ఆరోపించింది. చనిపోలేదు… చంపేశారు అంటూ టీడీపీ ఓ ట్వీట్‌ లో పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img