Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

యువగళం కార్యక్రమంలో నిరసన తెలిపిన తెలుగు యువత….

విశాలాంధ్ర-గుంతకల్లు : ప్రజా సమస్యల కోసం నారా లోకేష్ చేపట్టిన యువగళం రాష్ట్రంలో కార్యక్రమం శుక్రవారం కుప్పంలో మొదలైంది.ఈ కార్యక్రమానికి గుంతకల్లు నుండి తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు వాల్మీకి రాము, తెలుగు యువత నాయకులు నారాలోకేష్ పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ను భర్తీ చేయాలని రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు నిరసన చేపట్టారు.ఈ కార్యక్రమంలో గుంతకల్లు నుండి పెద్ద ఎత్తున తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img