Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మాజీ ఎమ్మెల్యేని సన్మానించిన మైనార్టీ నాయకులు

విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ని వైసీపీ మైనార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. బుధవారం ఉరవకొండ పట్టణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేని వారు కలిశారు.వైసిపి మైనార్టీ నాయకులు యం. ఇంతియాజ్ భాష కు టౌన్ బ్యాంకు ఎన్నికల్లో డైరెక్టర్ పదవికి అవకాశం కల్పించి ఏకగ్రీవంగా ఎన్నికలు జరగడానికి కృషి చేసినందుకు మాజీ ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మైనార్టీ నాయకులు మండల కో ఆప్షన్ మెంబర్ పామిడి సలిం. దర్గా కమిటీ అధ్యక్షుడు హోతూర్ బాషా. వడ్ల సలీం. బ్యాల ప్రసాద్. జేకే జిలాన్ యం. రఫిక్. ఆసిఫ్. వార్డ్ మెంబర్ సర్మస్,రఫిక్. ఖదర్. వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జీయంయస్ బాషా. ఎంపీటీసీ సభ్యులు వన్నుర్ సాబ్. వైసీపీ విద్యార్థి విభాగం జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి యం.జిలాన్ బాషా తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img