Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఆత్మహత్యకు కారకులైన వారిని శిక్షించాలి : ఏఐవైఎఫ్

విశాలాంధ్ర-ఆస్పరి : వివాహిత మహిళ అయినా కురువ రాజేశ్వరి ఆత్మ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి ఏఐవైఎఫ్ మండలం కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో రైటర్ కానిస్టేబుల్ ఆంజనేయులుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ పరిధిలోనే అట్టేకల్లు గ్రామంలో ఈనెల 1వ తేదీన బోయ శ్రీరాములు (శీను) అనే వ్యక్తి వేధింపులను భరించలేక వివాహిత మహిళా రాజేశ్వరి పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నాన్ని పాల్పడిందన్నారు. అయితే ఈనెల 6వ తేదీన కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగిందన్నారు. వేధింపులు తాళలేక తనలో తను కుమిలి పోయి మహిళ ఆత్మహత్య చేసుకోవడం, సభ్యసమాజం తలదించుకునేలా ఉందని పోలీసు ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. తక్షణమే కురువ రాజేశ్వరి ఆత్మహత్యకు కారకుడైనా బోయ శ్రీరాములపై హత్య కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అఖిలభారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల సహాయ కార్యదర్శి సురేష్, రేవన్, ఏఐవైఎఫ్ నాయకులు మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img