ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి, మహోన్నత విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని, ఆయన స్మృత్యర్థం సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దుతూ, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తున్న ప్రతి ఉపాధ్యాయుడికి ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. సమాజ నిర్మాణంలోనూ, విద్యారంగంలోనూ గురువుల పాత్ర ఎంతో అమూల్యమైనదని ఆయన కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జీవిత విశేషాలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అత్యంత సామాన్య నేపథ్యం నుంచి వచ్చిన ఆయన, తన ఆదర్శవంతమైన జీవనశైలితో దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి బాధ్యతలను చేపట్టారని పేర్కొన్నారు. సర్వేపల్లి ప్రయాణం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని.. ఆయన చూపిన మార్గాన్ని, పాటించిన విలువలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఉపాధ్యాయులకు చంద్రబాబు శుభాకాంక్షలు.. సర్వేపల్లి జీవితం ఆదర్శనీయం
- Advertisement -
RELATED ARTICLES


