Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

శివాలయాలలో ప్రత్యేక పూజలు

విశాలాంధ్ర -విజయనగరం : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విజయనగరం పట్టణంలో పుచ్చల వీధి లోని శ్రీ బాల గణపతి శివాలయం, బుచ్చన్న కోనేరు లో శ్రీ ఉమామహేశ్వర ఆలయం వద్ద అవనాపు విక్రమ్ దంపతులు.అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు శివరాత్రి సందర్బంగా ఆయా ఆలయాలను సందర్శించిన విక్రమ్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన నిర్వాహకులు, అర్చకులు విశేష పూజలు జరిపించి, పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు అందజేశారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ దేవ దేవుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుతూ, ప్రజలందరికీ మహాశివరాత్రి శుభకాంక్షలు తెలియజేశారు. బుచ్చన్న కోనేరు శ్రీ ఉమమహేశ్వర ఆలయ కమిటీ వారు ఆలయ పునర్నిర్మాణానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించి వచ్చే శివరాత్రి నాటికి నూతన ఆలయం ప్రారంభం కావాలని ఆకాంక్షించారు. డాక్టర్ అవనాపు భావన మాట్లాడుతూ ప్రజల్లో భక్తి భావాలు పెంపొందించడానికి, మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగమైన మహాశివరాత్రి వంటి పర్వ దినాలు తోడ్పడతాయన్నారు. సమాజంలో నేటి పరిస్థితుల్లో, ప్రజల్లో భక్తి భావాలు పెంపొందడం ఎంతైనా హర్షణీయమని అన్నారు. మహాశివరాత్రి వేడుకలు అంతా సంతోషంగా జరుపుకొని, ఆ మహాశివుని ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img