Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఈనెల 7న వాహనాలు వేలం నిర్వహణ

విశాలాంధ్ర-పార్వతీపురం: పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో నాటుసారా రవాణాచేస్తూ పట్టుబడిన 16 వాహనాలను ఈనెల 7న పోలిస్ స్టేషన్ ప్రాంగణంలో వేలం పాట నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఉత్సాహవంతులు, ఆసక్తి కలిగినవారు ఆరోజు ఉదయం 11గంటలకు పోలీసు స్టేషనుకు వచ్చి వేలంలో పాల్గొనవలసిందిగాగా కోరారు. వేలం పాటలో వాహనానికి నిర్ణయించిన కనీస ధరతో పాట నిర్వహిస్తామని చెప్పారు. నిబంధనలప్రకారం వేలం పాట నిర్వహిస్తామని, అవసరమైతే రద్దు చేస్తామని చెప్పారు.గతంలో తెలియ పరచిన 9 వాహనాలేకాకుండా ఒకఆటో రిక్షా, 12 మోటార్ సైకిల్ లు, 3 మోపెడ్లను వేలం పాట నిర్వహిస్తామని చెప్పారు. ఆయనతోపాటు పట్టణ ఎస్ ఐ ప్రకృద్దేన్ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img