Friday, May 3, 2024
Friday, May 3, 2024

డయాలసిస్ పెన్షన్ను అందజేసిన కౌన్సిలర్ మాసపల్లి సాయికుమార్

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కిడ్నీల వ్యాధితో బాధపడుతున్న వారికి, ఇంతవరకు ఏ ప్రభుత్వము ఇవన్నీ పెన్షన్ను నేడు ఏపీలో అందరికీ అందజేస్తుంది. ఇందులో భాగంగానే ధర్మవరం మండల పరిధిలోని చిన్నూరు గ్రామ నివాసి ఆదినారాయణ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతను వైయస్సార్ పెన్షన్ కానుక పథకముకు దరఖాస్తు చేసుకోగా, ఆ పెన్షన్ కు ఎంపిక కావడం జరిగింది. దీంతో సమాచారం అందుకున్న తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాసపల్లి సాయికుమార్ ఆ గ్రామానికి చేరుకొని ప్రభుత్వం పంపిణీ చేసిన పదివేల రూపాయలను వారి చేతుల మీదుగా శుక్రవారం అందజేయడం జరిగింది. పెన్షన్ రూపంలో ఇంత మొత్తం రావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని ఆదినారాయణ తో పాటు కుటుంబ సభ్యులు తెలుపుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img