Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

విద్యార్థులను ఆకట్టుకున్న ప్రయోగశాల

విశాలాంధ్ర – ఉరవకొండ : ఉరవకొండ మండలం ఆమిద్యాల ప్రభుత్వ హైస్కూల్లో సోమవారం టాటా పవర్ మరియు అగస్త్య అంతర్జాతీయ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహించిన ల్యాబ్ ఆన్ బైక్ ( బండి పై ప్రయోగశాల ) విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నది మండల విద్యాశాఖ అధికారి ఈశ్వరప్ప ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ కు సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజుల, టాటా పవర్ సంస్థ సి ఎస్ ఆర్ రామన్న గౌడ్, సుధాకర్, అగస్త్య ఫౌండేషన్ ఏరియా మేనేజర్ శ్రీధర్, మోహన్, ఐఎంటీ ఆనంద్, వీరితోపాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img