Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సౌత్ జోన్ చెస్ పోటీలకు కే.హెచ్ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక

విశాలాంధ్ర – ధర్మవరం: సౌత్ జోన్ చెస్ పోటీలకు పట్టణంలోని కే.హెచ్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు చెందిన డి. వంశీకృష్ణ ( బి.కాం) తృతీయ సంవత్సరం ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.కే.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం వారు మాట్లాడుతూ ఎస్కే యూనివర్సిటీ నిర్వహించినటువంటి సెలక్షన్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ఎస్కే యూనివర్సిటీ జట్టుకు ఎంపిక కావడం జరిగిందని తెలిపారు. ఎంపికైన ఈ విద్యార్థి చెన్నై లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లో ఈ నెల 10 వ తేదీ నుండి ప్రారంభమయ్యేటువంటి సౌత్ జోన్ పోటీలకు ఎస్కే యూనివర్సిటీ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తారన్నారు.విద్యార్థి వంశీ కృష్ణను కళాశాల ప్రిన్సిపల్ డా . కె ప్రభాకర్ రెడ్డి వైస్ ప్రిన్సిపల్ టి.జీవన్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ బి.ఆనంద్ , డా.యస్ .చిట్టెమ్మ, డా.యస్ షమీవుల్లా, ఏ.కిరణ్ కుమార్, డా.బి గోపాల్ నాయక్,యస్ పావని ,యం భువనేశ్వరి, యం పుష్పవతి ,జి గౌతమి తదితర ఆద్యాపక ఆద్యాపకేతర సిబ్బంది అభినందించి,హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img