విశాలాంధ్ర, పార్వతీపురం: పార్వతీపురం ఎమ్మెల్యే అలజింగి. జోగారావు సోమవారం జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటుహక్కును బలిజపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 83పోలింగు కేంద్రంలో
వినియోగించుకున్నారు. ఆయనతో పాటు అతని భార్య కూడా ఓటును వేశారు.
ఈసంధర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి సుధాకర్ గెలుపు తధ్యమని చెప్పారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యేతో పాటు నియోజక వర్గ నేతలంతా పార్వతీపురం లో ఉండి పర్యవేక్షణ చేశారు.