Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

తనకు స్వాగతం పలికేందుకు పరీక్షా సమయంలో విద్యార్థులనురోడ్లమీద నిలబెట్టిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి


విశాలాంధ్ర బ్యూరో – నెల్లూరు: పరీక్షలు జరుగుతున్న తరుణంలో మొదటి రెండవ సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులను ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి రాకకు స్వాగతం పలికేందుకు గంటల తరబడి వారి రోడ్లమీద నిలబట్టడం ఎంతవరకు సమంజసం. ముఖ్యంగా వారి కళాశాలకు చెందినటువంటి హాస్టల్ విద్యార్థులను రోడ్డు మీద తల్లిదండ్రుల యొక్క అనుమతి లేకుండా నిలబెట్టడం కూడా సమంజసం కాదని ఇది అధికార దుర్వినియోగం కాదా ఎన్నికైనటువంటి మరుక్షణం లోని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నటువంటివ్యక్తి చంద్రశేఖర్ రెడ్డి అని ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శిఖరం నరహరి ఆరోపించారు. ఈ విషయంపై ఇంటర్మీడియట్ బోర్డ్ ఉన్నతాధికారులకు ఆర్ఐకి ఫిర్యాదు చేయడం జరిగిందని వెంటనే సంబంధిత కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నరహరి డిమాండ్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img