Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

విశాఖపట్నంలో విషాదం – కూలిన 3 అంతస్తుల భవనం

విశాలాంధ్ర – విశాఖపట్నం : విశాఖపట్నంలో విషాదం నెలకొంది. కలెక్టరేట్‌ సమీపంలోని 29 వార్డు రామజోగి పేటలో మూడంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకు ముగ్గురు మృతి చెందారు. మరో ఆరుగురిని రక్షించి కేజీహెచ్‌ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు పురాతన భవనం కూలినట్టు ప్రాథమిక నిర్ధారణలో తేలింది. బిల్డింగ్‌ ఒక్కసారిగా కుప్పకూలిన శబ్ధాలకు పరిసర ప్రాంత ప్రజల భయాందోళన చెందారు. సమాచారం అందుకున్న ఎన్టీఆర్ఎఫ్‌, ఫైర్ సిబ్బంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బిల్డింగ్‌ కుప్పకూలడంతో బాలిక సాకేటి అంజలి (15) అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. రామకృష్ణ మిషన్‌ స్కూల్లో పదో తరగతి చదువుతోంది అంజలి. ప్రస్తుతం ఆమె సోదరుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. శిథిలాలలో మరో యువకుడు కూడా చిక్కుకున్నట్లు తెలుస్తోంది. G+ 2 భవంతిలో రెండు కుటుంబాలతో పాటు ఇద్దరు బ్యాచిలర్స్ నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. భవనం లో మొత్తం 9 మంది ఉన్నట్టు సమాచారం అందుతోంది. వారిలో అంజలి చనిపోగా 6 గురిని కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తారు. మరో ఇద్దరి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ చేస్తున్నారు ఎన్టీఆర్ఎఫ్‌, ఫైర్ సిబ్బంది. కాగా నిన్న (మార్చి 23) అంజలి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం విశేషం. ఇంతలోనే ఈ దుర్ఘటన చేసుకుంది. దీంతో అంజలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా శిథిలాల నుంచి మరొక మృత దేహం వెలికితీశారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న నూడిల్స్ షాప్ సహాయకుడు చోటు గా గుర్తించారు. బీహార్ కు చెందిన చోటు వయసు 30 సంవత్సరాలు. మృతదేహాన్ని కే జీ హెచ్ కు తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img