Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

జగన్నాటకం

. రాజధాని భూములపై మళ్లీ కిరికిరి
. ఆర్‌`5 జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ
. కోర్టు అక్షింతలు వేసినా మారని సర్కారు తీరు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: అమరావతి రాజధాని నిర్మాణాలను అర్ధాంతరంగా నిలిపివేసి విధ్వంసానికి పాల్పడిన జగన్‌ ప్రభుత్వం... రైతులిచ్చిన భూములను వినియోగించుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. నిరుపేదలకు ఇళ్లస్థలాల పేరుతో ఇక్కడి భూములను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సామాన్య ప్రజానీకానికి కేటాయించాలని చూస్తోంది. అందులో భాగంగా అమరావతిలో ఆర్‌5 జోన్‌ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం మళ్లీ గెజిట్‌ జారీ చేసింది. దీంతో అమరావతి రైతుల్లో మరోసారి అలజడి మొదలైంది. రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా రాజధానిలో ఆర్‌5 జోన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్‌ జారీ చేయడంపై విపక్షాలు సైతం మండిపడుతున్నాయి. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో దాదాపు 900 ఎకరాలను ఆర్‌-5 జోన్‌ పరిధిలోకి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై 2022 అక్టోబరులోనే ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ప్రభుత్వ నిర్ణయం సరికాదని పేర్కొంటూ జీవోను వ్యతిరేకిస్తూ అప్పట్లో రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. కనీసం రైతుల అభిప్రాయాలు తీసుకోలేదని హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో అధికారులు రాజధాని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మూకుమ్మడిగా రాజధాని రైతులు వ్యతిరేకించారు. అయినా రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై గెజిట్‌ విడుదల చేసింది. పేదవర్గాల ఇళ్ల కోసం భూములు కేటాయిస్తున్నట్టు గెజిట్‌లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మరోసారి కోర్టులో సవాలు చేసేందుకు రాజధాని రైతులు సిద్ధమవుతున్నారు. ఏమిటీ ఆర్‌5 జోన్‌?
రాజధాని బృహత్‌ ప్రణాళిక ప్రకారం ఇప్పటి వరకు 4 నివాస జోన్లు ఉన్నాయి. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం రాజధానిలో ఇంతవరకు ఆర్‌-1 (ప్రస్తుత గ్రామాలు), ఆర్‌-2 (తక్కువ సాంద్రత గృహాలు), ఆర్‌-3 (తక్కువ నుంచి మధ్యస్థాయి సాంద్రత కలిగిన గృహాలు), ఆర్‌-4 (హైడెన్సిటీ జోన్‌) పేర్లతో 4 రకాల నివాస జోన్లు ఉండేవి.
అయితే, రాజధానిలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. అందులోని 900.97 ఎకరాలను ఆర్‌-5 జోన్‌గా ఏర్పాటు చేస్తూ గెజిట్‌ జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img