Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

నియోజకవర్గ సమస్యలు పరిష్కారం చేయాలని సభ దృష్టికి తెచ్చిన ఎమ్మెల్యే

విశాలాంధ్ర – పార్వతీపురం : పార్వతీపురం నియోజక వర్గంలో సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే జోగారావు శుక్రవారం శాసన సభలో మాట్లాడారు. 9వరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలలో పాల్గొన్న పార్వతీపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అలజంగి జోగారావు నియోజకవర్గ సమస్యలపై గళమెత్తడం జరిగిందన్నారు. అసెంబ్లీ స్పీకర్ సాక్షిగా ప్రధాన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయాలని కోరడం జరిగినదన్నారు. పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో నూటికి నూరు శాతం గిరిజనులు ఉండే16 గిరిజన గ్రామాలను షెడ్యూల్ ఏరియాలో చేర్చాలని అసెంబ్లీ స్పీకర్ ద్వారా సీఎం వైయస్ జగన్ ను కోరడం జరిగినదన్నారు. పార్వతీపురం నియోజకవర్గంలోని బలిజిపేట మండలంపరిధిలో ఇటీవల కురిసిన అకాల వర్షాల మూలంగా మొక్కజొన్న పంట మొత్తం పాడైపోయిందని, అధికారులచే పరిశీలన చేయించి రైతులను ఆదుకోవాలని సభ ద్వారా వ్యవసాయశాఖ మంత్రిని కోరడం జరిగిందన్నారు. ఈశాసనసభ సమావేశాల్లో తనకు మూడుసార్లు సభలో మాట్లాడే అవకాశం కల్పించిన సభా అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేసానని ఆయన విలేకరులకు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img