Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

పదవ తరగతి విద్యార్థులకు ఉచిత పరీక్ష కిట్స్ పంపిణీ

ఆత్మీయ ట్రస్ట్ చైర్మన్ సెట్టీపి జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ మున్సిపల్ హై స్కూల్ లోని పదవ తరగతి చదువుతున్న 200 మంది విద్యార్థినీలకు ఉచితంగా పరీక్ష ఫ్యాట్స్ పెన్నులను మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, ఆత్మీయ ట్రస్టు చైర్మన్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సెట్టిపీ జయ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ బీరే ఎర్రి స్వామి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రమణ, యుటిఎఫ్ పట్టణ అధ్యక్షులు రామకృష్ణ నాయక్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షా సమయం ఆసన్నమైనదని, భయాందోళనలు వీడి, ధైర్యంగా పరీక్షలకు సన్నిధమై, మంచి ఉత్తీర్ణత సాధించాలని పిలుపునిచ్చారు. పదవ తరగతి జీవితములో పునాదిగా నిలుస్తుందని, ఆందోళనకు గురికాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ప్రణాళికా పద్ధతిగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని, పరీక్షల్లో విజయాన్ని సాధించాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img