Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

జి సి సి స్టాల్ ను సందర్శించిన ఐటిడిఏ ప్రోజెక్టు అధికారి విష్ణు చరణ్


విశాలాంధ్ర, పార్వతీపురం: జిల్లా కేంద్రంలోని పెట్రోలు బంకువద్ద గిరిజన కార్పొరేషన్ సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జి సి సి స్టాల్ ను, పోస్టు ఆఫీసు వద్ద జి సి సి షాపులను ఐటీడిఏ ప్రాజెక్టు అధికారి విష్ణు చరణ్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. మరిన్ని సేవలను పెంచుతూ అభివృధ్ధి అందజేయాలని పిఓ ఆదేశించారు. దీంతోపాటు గుమ్మలక్ష్మిపురంలో గల జిసిసి షాపును కూడా ప్రోజెక్టు అధికారి తనిఖీ చేశారు. గిరిజన సహకార సంస్థలను మరింత అభివృధ్ధి చేయాలని, ఐటీడిఏ నుండి సహకారం అందిస్తామని పిఓ హామీ ఇచ్చారు. పెట్రోల్ బంకు వద్ద గల జిసిసి కాఫీ హౌస్ లో మరిన్ని గిరిజన సహకార ఉత్పత్తులు పెట్టాలని సూచించారు.ఆయనతో గిరిజన సహకార సంస్థ డివిజనల్ మేనేజర్ మహేంద్ర కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img