Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఘనంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

విశాలాంధ్ర -ధర్మవరం : పట్టణంలోని తేరు బజార్లో గల వాసవి కళ్యాణ మండపం కొత్త సత్రమునందు గురువారము నాడు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాల నడుమ ఆర్యవైశ్యులు నిర్వహించుకున్నారు. ఉభయ దాతలుగా వసంత లక్ష్మి,కలవల బద్రి నారాయణ గుప్తా-శ్వేతా స్టీల్ సెంటర్- ధర్మవరం వారు నిర్వహించారు. పురోహితులు నారాయణమూర్తి, చంద్రశేఖర్ శర్మ, జయసింహ లు, వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ, వందలాది భక్తాదులు నడుమ అత్యంత వైభవంగా ఈ కళ్యాణ మహోత్సవ వేడుకలను జరిపారు. అనంతరం తీర్థ ప్రసాద కార్యక్రమాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘము, వాటి అనుబంధ సంస్థ సంఘం, అల్వాల శ్వేత, అల్వాల సందీప్ ,అల్వాల అని, అన్విత, కలవల కృష్ణ తేజ, కలవల వెంకట్, అఖిల్, తదితర కుటుంబ సభ్యులు, ఆర్యవైశ్య తదితర భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img