Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నాపై అసత్య ఆరోపణలు చేయడం మానండి

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి


విశాలాంధ్ర – ధర్మవరం : గత మూడు రోజులుగా నాపై అనేక అసత్య ఆరోపణలు చేస్తే నాది కానిది నాకు అంటగట్టే ప్రయత్నం చేయడం సరైన పద్ధతి కాదని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఈ సందర్భంగా వారి స్వగృహంలో బుధవారం మాట్లాడుతూ అసత్య ఆరోపణలు తెలిపే ముందు నిజాలు తెలుసుకొని మాట్లాడితే ప్రజలకు అర్థమవుతుందని తెలిపారు.దీనిపైన ఇప్పుడు లోకేష్, గతంలో బిజెపి వారు లేనిది ఉన్నట్లు చూపించి, నాపై అపవాదు వేయాలనే ప్రయత్నం మానుకోవాలన్నారు.
తాను మొదటి నుంచి చెబుతున్నది ఒకటే, ధర్మవరం పొలం, సర్వే నెంబర్లు 904,905,908,909 సంబంధించిన భూమి కేవలం 25 ఎకరాల 38 సెంట్లు మాత్రమే నాకు చెందినవి అని, ఆ భూమిని నేను రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేయడం జరిగిందన్నారు.
మొన్నటి వరకు చెరువు కబ్జా చేశానని చెప్పి తెలుగుదేశం వారు ఫేస్బుక్లో పేజిలో వీడియోస్ పెట్టి తప్పుడు ప్రచారం చేశా రణి మండిపడ్డారు. తర్వాత చూస్తే చెరువు కాదు,పక్కన ఉన్న భూమిని కబ్జా చేశానని ఆరోపించడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. పక్కన ఉన్న భూమి, పోతులనాగేపల్లి పొలం, సర్వే నెంబర్ 43, జె సూర్యనారాయణ అనే అతనికి చెందినదని, భూమిని కూడా గూగుల్ మ్యాప్ లో నా భూమితో కలిపి చూపించడం జరిగిందన్నారు. నాకు చెందిన భూమి కేవలం 25 ఎకరాల 38 సెంట్లు భూమి మాత్రమే మాత్రమేనని వారు తెలిపారు.ఇప్పటికైనా ఫేక్ గ్రాఫిక్స్ గాని తప్పుడు ఆరోపణల చేసి చూపించే ప్రయత్నం మానుకోవాలని తెలుగుదేశం నాయకులకు వారు హితవు పలికారు.
తాను ఇప్పటికీ చెప్పిన ఛాలెంజ్ మీద నిలబడే ఉన్నానని సవాల్ విసిరారు.
టిడిపి వారు గూగుల్ మ్యాప్ సహాయంతో ఎవరైతే, నా పక్కన ఉన్న భూమిని నేను కబ్జా చేశానని తప్పడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేసిన వారిపై, పలు దినపత్రికలపై చట్టపరంగా వాళ్ల మీద కోర్టుకి వెళ్తానని తెలిపారు. తాను కొన్న భూమి 25 ఎకరాల 38 సెంట్లు మాత్రమే నని తెలుపుతూ దీనిమీద సర్వే అన్నా చేసుకోవచ్చని, లేదంటే శిట్ ద్వారా దర్యాప్తు చేసుకోవచ్చని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img