Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కార్పొరేట్ సంస్థలకు అండగా మోడీ ప్రభుత్వం

ప్రజా వ్యతిరేక నిరంకుశ పాలన అందిస్తున్న మోడీ ప్రభుత్వం …….ఏపీ రైతుసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటమయ్య

విశాలాంద్ర- తనకల్లు: మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లో ప్రజా వ్యతిరేక ,నిరంకుశ, మతోన్మాద బిజెపి విధానాలపై ప్రచార భేరి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా కాటమయ్య మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని సాగనంపాలని, దేశాన్ని కాపాడుకోవాలని అన్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహం అంతా ఇంత కాదన్నారు. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం నిధులు, రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇలాంటి హామీలు ఇచ్చి అమలు చేసిన పాపాన పోలేదన్నారు. ఏపీకి ఆయుపట్టు లాంటి విశాఖ ఉక్కును కార్పొరేట్ రాబందులకు కేంద్రం కట్టబెట్టడానికి కుట్ర పన్నుతోందన్నారు. నరేంద్ర మోడీ ఏపీకి చేస్తున్న ద్రోహాన్ని వైఎస్ఆర్సిపి పార్టీ నిలదీయలేకపోతుందన్నారు. గంగవరం, కృష్ణపట్నం అలాంటి కీలకమైన ఓడరేవులను హైడ్రో విద్యుత్ ప్రాజెక్టులను సోలార్ విద్యుత్ కోసం ఎంతో విలువైన భూములను ఆదాని లాంటి కార్పొరేట్ శక్తులకు ధారా దత్తం చేసేందుకు పూనుకుంటుందన్నారు. నరేంద్ర మోడీ ఆదేశాలకు లొంగి ప్రజల మీద విద్యుత్ స్మార్ట్ మీటర్లను అధిక భారం వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుందన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వం నిలదీయలేకపోతుందన్నారు.బిజెపి వైసిపి పాలనకు భిన్నంగా కేరళలో వామపక్ష ప్రభుత్వం ఆదర్శవంతంగా నడుపుతోందన్నారు. కేరళ ప్రభుత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమం లో ఏపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షా కార్యదర్సులు హనుమంతరెడ్డి, జేవీ రమణ, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రాజేంద్రప్రసాద్, సీపీఐ డివిజన్ కార్యదర్శి కదిరప్ప, సహాయ కార్యదర్శి రాజేష్ మండల కార్యదర్శి రెడ్డెప్ప ,రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఇక్బాల్ , సహాయ కార్యదర్శి చౌడప్ప, కరిముల్లా , రమణ, రామకృష్ణ సీపీఎం మండల కార్యదర్శి శివన్న , సీపీఐ,ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img