Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రైల్వే బ్రిడ్జి అండర్ రోడ్డు కోసం సర్వే పనులు

విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండల పరిధిలోని పీకలబెట్ట గ్రామానికి రైల్వే బ్రిడ్జి అండర్ రోడ్డు నిర్మించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీనిలో భాగంగా బుధవారం రైల్వే అధికారులు మరియు రెవెన్యూ అధికారులు సర్వే పనులు ప్రారంభించారు. ఎన్నో ఏళ్ళుగా పీకలబెట్ట గ్రామానికి రైల్వే గేటు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అలుపెరుగని పోరాటాలు చేశారు. అయితే ప్రభుత్వం రైల్వే గేటు ఏర్పాటుకు అనుమతి మంజూరు చేసింది. పీకలబెట్ట గ్రామానికి అండర్ రోడ్డు సాధించిన ఘనత మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికే దక్కుతుందన్నారు. దీంతో గ్రామ సర్పంచ్ మూలింటి లక్ష్మి, వైసీపీ నాయకులు మూకిరెడ్డి, నాగరాజు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img