Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

ఘనంగా 137వ మే డే వేడుకలు

విశాలాంధ్ర – ఆస్పరి : కార్మిక కర్షక పండుగ మే డే వేడుకలు సోమవారం ఆస్పరిలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా స్థానిక సిపిఐ కార్యాలయం నుండి బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం బస్టాండ్, అంబేద్కర్ సర్కిల్లో ఏఐటీయూసీ పథకాన్ని సిపిఐ మండల కార్యదర్శి విరుపాక్షి, సీనియర్ నాయకులు నాయకులు ఉరుకుందప్ప ల చేతుల మీదుగా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి మండల కార్యదర్శి కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అనేకమంది అమరవీరుల ప్రాణాల బలిదానం పనిగంటలు సాధించుకున్న దినం మే డే అని అన్నారు. అంత కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను నేడు బిజెపి హరిస్తుందని అన్నారు. ప్రపంచ కార్మికుల ఐక్యత కోసం ప్రతి ఒక్కరు ఐక్యతతో ఉద్యమించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల సహయ కార్యదర్శి రాజశేఖర్, హమాలీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు హనుమంతు, జైపాల్, చంద్రశేఖర్, ఏఐఎస్ఎఫ్ నాయకులు ఈశ్వర్, గోవిందు, రామంజిని, పాండు, బజారి, మల్లికార్జున, రామయ్య , గోపాలు, రంగముని, నాగేంద్ర, పవన్,, తాయప్ప, హోటల్ వీరేషు, ఆకుల హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img