Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రోడ్డుప్రమాదంలో మృతిచెందిన కుటుంబానికీ 5లక్షల 44వేలు చెక్కు అందజేత

విశాలాంధ్ర – పార్వతీపురం: గతనెల ఏప్రిల్ 24న దురదృష్టశాత్తు రోడ్డుప్రమాదంలో మరణించిన పిన్నింటి.లక్ష్మి కుటుంబానికి జిల్లావైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సేకరించిన విరాళం డబ్బులు 5లక్షల, 44వేల4వందలరూపాయల చెక్కును జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ చేతులమీదుగా మంగళవారం అందజేసారు.తాడికొండ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఎం ఎల్ హెచ్ పి గా విధులు నిర్వహించిన పిన్నింటి లక్ష్మి విధులు నిర్వహించి తిరుగు ప్రయాణంలో ద్విచక్రవాహనంపై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంగతి తెలిసిందే. దీంతోజిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జగన్నాథం, ఆర్ బి ఎస్ కె అధికారి భాస్కరరావు, జిల్లా ఏపి ఎన్జీఓ అధ్యక్షులు జి వి ఆర్ ఎస్ కిషోర్ గారు, వైద్య అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టరు రఘు, సెక్రెటరీ డాక్టర్ వినోద్ సి హెచ్ ఓ అసోసియేషన్ అధ్యక్షులు సి హెచ్ జగదీష్ కుమార్, రాజేశ్వరిఇంద్రాణీ, జాకబ్ పానల్ మెంబర్స్ అంతా కలిసికట్టుగా ఆమెకుటుంబానికి చేయూత కోసం పిలుపునివ్వగా అనూహ్యస్పందన వచ్చి రూ.5,44,400/- లు డొనేషన్ వసూలు చేశారు. పార్వతీపురం మన్యం జిల్లాకలెక్టర్ నిశాంత్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ సంఘాల నేతలు ఆద్వర్యంలో పిన్నింటి లక్ష్మీ తల్లి పిన్నింటి పుష్పకు చెక్కరూపంలో అందజేసారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img