Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పేద, అనాధ ప్రజలకు సేవ చేయడమే మా ఆశయం.. శ్రీ సత్య సాయి భజన మండలి

విశాలాంధ్ర -ధర్మవరం:: పేద అనాధ ప్రజలకు సేవ చేయడమే మా ఆశయమని శ్రీ సత్య సాయి భజన మండలి సేవాదళ్ సభ్యులు సాంబశివుడు, ఆచారి, నాగిరెడ్డి, సుబ్రమణ్యం, లక్ష్మీనారాయణ, కాకుమాని సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం పట్టణంలోని పాండురంగ స్వామి దేవాలయంలో నారాయణ సేవ పేరిట పేద, అనాధ ప్రజలకు 600 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. అంతేకాకుండా మండల పరిధిలోని గో ట్లురు గ్రామంలో 35 మంది అనాధాశ్రమంలోని వారికి, తాడిమర్రి మండలం నార్సింపల్లి గ్రామం నందు గల అనాధ శ్రమం లోని వారికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారు తెలిపారు. పుట్టపర్తి శ్రీ సత్య సాయి బాబా ఆశీస్సుల మేరకు ఇటువంటి సేవా కార్యక్రమాలను చేపట్టడం మాకేంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలను చేపడతామని, దాతల సహాయ సహకారాలతో ముందుకు వెళతామని తెలిపారు. ప్రతి వ్యక్తి మానవ సేవను అలవర్చుకుంటే అది దైవ సేవగా గుర్తించబడుతుందని తెలిపారు. మానవ ప్రయత్నానికి దైవ సహాయం ఎంతో అవసరమని వారు తెలిపారు. ప్రతి వ్యక్తి దైవచింతను కూడా అలవర్చుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img