Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

నేటి నుంచి రాత్రి వేళల్లో తాజ్‌మహల్‌ సందర్శనకు ఓకే


దాదాపు 17 నెలల తర్వాత రాత్రి వేళల్లో తాజ్‌మహల్‌ సందర్శనకు పర్యాటకులకు అనుమతి లభించింది. కరోనా నేపథ్యంలో గతేడాది మార్చి నెలలో రాత్రి వేళల్లో తాజ్‌మహల్‌ను వీక్షించేందుకు సందర్శన రద్దు చేశారు. చానాళ్ల తర్వాత రాత్రి సందర్శనకు అనుమతి రావడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వారంలో శుక్ర, ఆదివారాలు మినహా తాజ్‌మహల్‌ రాత్రి సందర్శనకు అనుమతి ఉంటుంది. పర్యాటకుల కోసం రాత్రి 8:30 నుంచి రాత్రి 10 గంటల వరకు అర గంట చొప్పున మూడు స్లాట్‌లు అందుబాటులోకి తెచ్చారు.సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ప్రతి స్లాట్‌లో 50 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img