Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కాలుష్య రహిత సమాజ నిర్మాణం చేపడుదాం

విశాలాంధ్ర – జె ఎన్ టి యుఏ : కాలుష్య రహిత సమాజ నిర్మాణం చేపడుదాం అని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పి సుజాత పేర్కొన్నారు. సోమవారం జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. ప్రకృతి మానవాళి ఎన్నో రుగ్మతల నిర్మూలనకు పరిష్కారాన్ని చూపుతూ ఆరోగ్య సంరక్షణకు రక్షణ కవచం వంటిదని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు డా. కే. జితేంద్ర గౌడ్, డా. డీ. విష్ణు వర్ధన్, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img