ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నివారణా చర్యలపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్పై, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కేసులు పెరగడంపై కోర్టు ఆరా తీసింది. ఆ రెండు జిల్లాల్లో కొవిడ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. సెప్టెంబర్ 8 నాటికి స్టేటస్ రిపోర్టు దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.