Monday, May 20, 2024
Monday, May 20, 2024

ధర్మవరం ప్రజలకు క్షమాపణలు తెలిపిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి గత కొన్ని నెలలుగా సేవ్ ధర్మవరం అనే కార్యక్రమంలో ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసి భరోసా కల్పించి అవన్నీ నెరవేర్చలేకపోతున్నందునకు ధర్మవరం ప్రజలకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి క్షమాపణ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ మిత్రపక్ష అభ్యర్థిగా బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్ నియమించినందుకు వారికి శుభాకాంక్షలు అని తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని, కార్యచరణతో ప్రజల ముందుకు వెళ్లి వారి అభిప్రాయాలను తెలుసుకొని ,ఆ విషయాలన్నీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. అలాగే బిజెపి అభ్యర్థి సత్య కుమార్ యాదవ్కు తెలియజేస్తానని, ప్రజాభిప్రాయము జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల అభిప్రాయము అలాగే పవన్ కళ్యాణ్ నిర్ణయం మేరకు మా నిర్ణయాన్ని తెలియజేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img