Monday, May 6, 2024
Monday, May 6, 2024

గజరాజు పై ఓటు… గిరిజన ప్రాంతాభివృద్ధికి చోటు

బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి అప్పారావు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- బహుజన సమాజ్ పార్టీ గుర్తు అయిన గజరాజు (ఏనుగు) పై ఓటు మన్య ప్రాంత అభివృద్ధికి చోటు అని ఆ పార్టీ పాడేరు నియోజకవర్గ అభ్యర్థి సుర్ల అప్పారావు అన్నారు. బుధవారం చింతపల్లి వారపు సంతలో జోరుగా ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చింతపల్లి వాసినైన తాను పాడేరు నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తన గుర్తు ఏనుగు అన్నారు. గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన చట్టాలు హక్కులు పటిష్టంగా అమలు కావాలంటే బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. గిరిజన చట్టాలు హక్కులపై గిరిజనుల వానిని చట్టసభలలో వినిపించే అభ్యర్థులను గెలిపించుకోకుంటే పోరాడి సాధించుకున్న హక్కులు ,చట్టాలు నిర్వీర్యమై భావితరాల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదం లేకపోలేదని, అందుకే బహుజనుల కోసం పోరాడే బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు గజరాజు (ఏనుగు) గుర్తు పై తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి తనను ఆశీర్వదించాలని ప్రచారం సందర్భంగా ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img