Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

వైకాపా అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పనిచేయండి

జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికలలో వైకాపా విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని జెడ్పీటీసీ పోతురాజు బాలయ్య అన్నారు .పార్టీ నాయకులతో కలిసి మంగళవారం అన్నవరం, తమ్మెంగుల పంచాయతీలలోని పలుగ్రామాలలో ఆయన పర్యటించారు. ముందుగా అన్నవరం పంచాయతీలోని బరిమిబంద, సోమవరం, వంతలపాడు గ్రామాలు సందర్శించి గ్రామస్తులతో మమేకమై రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.ఆయా గ్రామాల ప్రజలు వైకాపా వైపు ఆకర్షితులై ఉన్నారని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై అభిమానంతో ఉన్నారనడం లో సందేహం లేదన్నారు. ఏ గ్రామం వెళ్ళినా వైకాపా అభ్యర్థులకు విశేష ఆదరణ లభిస్తుందన్నారు. తమ్మెంగుల పంచాయతీ లో తమ్మెంగుల, పూసలపాడు, కిలిమిసింగి గ్రామాలు సందర్శించారు. రెండు ఓట్లు కూడా ప్యాను గుర్తు పై వేసి పాడేరు శాసనసభ్యులుగా మచ్చరాస విశ్వేశ్వర రాజును పార్లమెంటు సభ్యురాలుగా తనుజా రాణి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో తమ్మెంగుల పంచాయతీ సర్పంచ్ సలిమితి లక్ష్మయ్య, కుడుము సారి వార్డు సభ్యుడు బొండా సింహాచలం, పార్టీ నాయకులు సాగిన సుందరరావు, సుండ్రు చిన్నాబ్బాయి, బూసరి కృష్ణారావు, సాగిన గంగన్న పడాల్, వంతల రాజారావు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img