Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

పదవ తరగతి ఫలితాల్లో మండల టాపర్ గా యశ్వంత్ నాయుడు

సెయింట్ ఆన్స్ పాఠశాల విద్యార్థులకు మండలంలో ప్రథమ, ద్వితీయ స్థానాలు.

ప్రథమ స్థానం దక్కించుకున్న యశ్వంత్ నాయుడు, ద్వితీయ స్థానంలో టీజ అన్సిత.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- పదవ తరగతిలో చింతపల్లి మండల టాపర్ గా చింతపల్లి మండల కేంద్రానికి చెందిన డ్రైవర్ జామి దేముడు, దేవి దంపతుల కుమారుడు జామి దుర్గా వెంకట యశ్వంత్ నాయుడు పదవ తరగతి ఫలితాల్లో మండలంలోనే టాపర్ గా నిలిచాడు. స్థానిక సెయింట్ ఆన్స్ పాఠశాలలో విద్యను అభ్యసించిన యశ్వంత్ నాయుడు పాఠశాలలోనే గాక మండలంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. అదే పాఠశాలలో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న వంతల టీజ అన్షిత మండలంలో ద్వితీయ స్థానంలో నిలిచిందని మండల విద్యాశాఖ అధికారి పనసల ప్రసాద్ అన్నారు. స్థానిక సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన వీరు పదో తరగతి పరీక్షలు రాసి 600 మార్కులకు గాను యశ్వంత్ నాయుడు 558, టీజ అన్షిత 557 మార్కులు సాధించి మండలంలోనే అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులుగా ప్రతిభ కనబరిచారు. టీజ అన్షిత తండ్రి విజయరాజు కోర్టు ఉద్యోగి కాగా, తల్లి స్వరూప ఉపాధ్యాయురాలిగా ఉన్నారు. పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన వీరిద్దరిని ఆయన అభినందించారు. యశ్వంత నాయుడు, అన్షితలు ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సంపాదించి మండలంలోనే టాపర్ లుగా నిలవడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారిని అభినందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img