విశాలాంధ్ర` కళ్యాణదుర్గం టౌన్ : డాక్టర్ బి.ఆర్ సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని తెదేపా ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించి వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాల రాసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అని వారు ప్రశ్నించారు. దేశంలోనే అరాచకాలకు అంబేద్కర్ ఆశలకు విరుద్ధంగా జగన్ రాష్ట్రాన్ని అరాచకాలలో ప్రథమ స్థానంలో ఉంచారన్నారు.