విశాలాంధ్ర` ధర్మవరం : అభాగ్యులకు అమ్మ ఒడియే ‘‘ఉయ్యాల’’ అని, ఈ ఏర్పాటును ప్రభుత్వం చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం ఐసిడిఎస్.. సిడిపిఓ.. లక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ‘‘ఉయ్యాల’’ ను ఏర్పాటు చేశారు. అనంతరం ఐసిడిఎస్ లక్ష్మి మాట్లాడుతూ ఈ ఉయ్యాల కార్యక్రమమును ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమ ఉద్దేశమును తెలుపుతూ.. వద్దనుకున్నా, వదిలించుకోవాలనుచున్న పిల్లలను, రోడ్డుపక్క, కంప చెట్లలో పడవేయకుండా, క్షేమంగా ఉయ్యాల యందు బిడ్డను ఉంచవలెనని తెలిపారు. తదుపరి ఉయ్యాలలో వేసిన బిడ్డను సురక్షితమైన శిశు గృహమునందు, వసతి కల్పించబడుతుందని తెలిపారు. కావున ఈ కార్యక్రమం విజయవంతం కావుటకు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు నజీర్, శ్రావణి, నర్సింగ్ సూపర్డెంట్ రమాదేవి, హెడ్ నర్స్ పూర్ణచంద్ర, సరళ కుమారి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు లతా కిరణ్, మనిమాల, రాజేశ్వరి, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు పాల్గొన్నారు.