విశాలాంధ్ర -ఉరవకొండ : ఉరవకొండ మండలం వై రాంపురం గ్రామానికి చెందిన కె శివకుమార్ అనే రైతుకి చెందిన అరటి తోటకు నిప్పంటుకోవడంతో దాదాపు 750 అరటి చెట్లు దగ్ధమయ్యాయి సోమవారం అరటి తోటలో అగ్ని ప్రమాదం జరగడంతో సమాచారం అందుకున్న ఉరవకొండ అగ్నిమాపక శాఖ అధికారులు హుటాహుటిన వై రాంపురం గ్రామానికి చేరుకుని మిగిలిన అరటి చెట్లను కాపాడారు ఈ కార్యక్రమంలో ఫైర్ స్టేషన్ ఆఫీసర్ భీమలింగయ్య సిబ్బంది పాల్గొన్నారు