విశాలాంధ్ర`ఉరవకొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని పరిపాలనలో కులమతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ కూడా సంక్షేమ పథకాలు. అందిస్తున్నామని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు బుధవారం ఉరవకొండ మండలం బుదగవి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.