విశాలాంధ్ర-అనంతపురం వైద్యం : అనంత పట్టణ ప్రజలకు వివిధ ప్రాపర్టీ వెంచర్ల సంస్థలు, భవనాలను కట్టడానికి సంబంధించిన బ్రిక్స్, సిమెంట్, ఐరన్ రాడ్ల, ఇంటీరియర్ డెకరేషన్, వాటర్ ప్యూరిఫై కంపెనీలు కలిసి ఒకే చోట 2023 ఎక్స్పో నిర్వహించడం జరిగిందని క్రెడై ప్రాపర్టీ, బిల్టేచ్ ఎక్స్పో ఆర్గనైజర్ ఆనంద్ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక రాయల్ ఫంక్షన్ హాల్లో మూడు రోజులపాటు ఈ ఎక్స్పో ను స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య వివిధ స్టాళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ … భవన నిర్మాణానికి సంబంధించిన వివిధ స్టాళ్లు ఒకే చోటకు రావడం అనంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఎక్స్పోను ప్రజలు సద్వినియోగం చే సుకోవాలన్నారు.