విశాలాంధ్ర – కళ్యాణదుర్గం టౌన్ : వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మరోసారి అధికారాన్ని నిలబెడతాయని మంత్రి ఉషశ్రీ చరణ్ పేర్కొన్నారు. శుక్రవారం బ్రహ్మసముద్రం మండల పరిధిలోని బాల వెంకటాపురం జింకల దొడ్డి గొల్లల దొడ్డి తదితర గ్రామాలలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉషశ్రీ చరణ్ హాజరై ఎన్నింటికి వెళ్లి జగన్ ప్రవేశపెట్టిన పథకాల గురించి ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతున్నాయని ఆ పథకాలే జగన్ను మరోసారి అధికారంలోకి తెస్తాయని ఆమె భరోసా ఇచ్చారు . ఈ కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.