Friday, April 26, 2024
Friday, April 26, 2024

ముస్లిం సమాధుల స్థలం అభివృద్ధి కోసమే కార్యక్రమాలు చేపట్టాము..

పట్టణ మత పెద్దలు, మసీదుల ముత్వల్లీలు
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణములోని ముస్లిం సమాధుల స్థల అభివృద్ధి కోసమే అక్కడ చదును చేసే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, ఈ విషయాన్ని రాజకీయం చేయరాదని పట్టణ మత పెద్దలు రహమతుల్లా, సయ్యద్ మునాఫ్, తాహిర్ మౌలానా, తురబ్ మౌలానా,జామియా మసీద్ ముత్తు వల్లి ముస్తాక్ అహ్మద్, మదీనా మసీదు ముత్వల్లి జాకీర్ హుస్సేన్, అంజుమాన్ కమిటీ అధ్యక్షులు ఖలీల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని గాంధీ నగర్ లో గల ముస్లింల యొక్క సమాధుల స్థలాన్ని అభివృద్ధి పరచి అందరికీ అనుకూలంగా ఉండే విధంగానే తాము ట్రస్టు నిధులతో కార్యక్రమాలు చేపట్టడం జరుగు తోందన్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఈ విషయంలో జోక్యం చేసుకొని బురద చల్లడం మానుకోవాలన్నారు. భవిష్యత్తులో కూడా ముస్లింలకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ముస్లిం సోదరులు కూడా తప్పుడు సమాచారానీ ,అపోహలను నమ్మవద్దని వారు కోరారు. ముస్లింల అభివృద్ధి కొరకే ముత్వల్లీలు నిరంతరం కృషి చేస్తున్నారన్న విషయాన్ని కూడా వారు గుర్తు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img