Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఉత్తమ సేఫ్టీ డ్రైవర్ ఇన్స్పెక్టర్గా అవార్డు పొందిన సుమోశీన

విశాలాంధ్ర= ధర్మవరం : ధర్మవరం డిపోలో డ్రైవర్గా విధులు నిర్వర్తిస్తున్న సుమో శీనాకు, శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఆర్టీసీ డిపోలో నిర్వహించిన రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా వారికి సేఫ్టీ డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ (ఎస్ డ్డీఐ అవార్డును) ఆర్టీసీ జోనల్ చైర్మన్ మాల్యవంతం మంజుల, డిప్యూటీ సీఎం. మోహన్ కుమార్, హిందూపురం ఆర్డిఓ రమణ చేతులమీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం జోనల్ చైర్మన్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క డ్రైవరు కృషి చేయాల్సిన అవసరం ఉందని, మీ వద్ద బస్సు ప్రయాణికుల ప్రాణాలు ఆధారపడి ఉంటాయని వారు తెలిపారు. కావుననే ప్రతి డ్రైవర్లు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే, ప్రమాదాలను నివారణ చేయవచ్చునని తెలిపారు. అనంతరం డిపో అధికారులు, సిబ్బంది, బంధుమిత్రులు, సుమోసినోను ప్రత్యేకించి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img