Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాంపై ఐఎఫ్టియు జిల్లా మహాసభ విజయవంతం…

విశాలాంధ్ర- గుంతకల్లు : భారత కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో శనివారం గుంతకల్లప్ప కళ్యాణ మండపంలో జిల్లా మహాసభ ఏర్పాటు చేశారు. ఈ మహాసభ కార్యక్రమాన్ని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బి.సురేష్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులు ఓ పి డిఆర్ రాష్ట్ర కార్యదర్శి అడ్వకేట్ ఆర్ రామ్ కుమార్,ఐఎఫ్టియు రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్వర్లు, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఇండ్ల ప్రభాకర్ రెడ్డి ,మానవ హక్కుల వేదిక ఏపీ సమన్యాయ కమిటీ సభ్యులు చంద్రశేఖర్ సిటిజన్ ప్రోగ్రెసివ్ ఫోరం కార్యదర్శి తారకేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వ కార్మికుల హక్కులు చట్టాలను కాలరాస్తున్నాడని మండిపడ్డారు కార్మికులను ఏదో విధంగా ఉక్కు పాదం మోపుతూ అణిచివేతకు గురి చేస్తున్నారన్నారు. కార్పొరేట్ సంస్థలకు బడా పారిశ్రామిత్తలకు మాత్రం ఉపయోగపడుతున్నాడని ఉన్నారు కష్టజీవులకు కార్మిక చట్టాలతో ఇబ్బందులు పెడుతున్న పరిస్థితుల్లో కార్మిక చట్టాలపై ఉద్యమ పోరాటంపై అనేక అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పట్టణ కార్యదర్శి చిన్న తదితరులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img